BRS PRASHANTH REDDY SLAMS CONGRESS : బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చిందని, మాజీమంత్రి ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఆరు రోజులు రోజుల్లో ఒక్క రోజే ప్రశ్నోత్తరాలకే అవకాశం ఇచ్చారని, జీరో అవర్ ప్రస్తావనే లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. కేవలం రెండు రోజుల్లోనే పద్దులపై చర్చ పూర్తి చేశారన్న ఆయన, బీఆర్ఎస్ను తిట్టేందుకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు