Praja Palana Celebrations : చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోందని, త్వరలోనే గ్రూప్ 1 నియామక పత్రాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని సీఎం ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ వేడుకలను రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.