Telangana New Governor Jishnu Dev Varma : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే రాజ్ భవన్లో ప్రమాణం చేయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాల్గవ గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.