Governor Jishnu Dev Varma Visit 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపద రమణీయంగా ఉందని, ఇదంతా భారతదేశ చారిత్రక సంపదకు నిలయమన్నారు గవర్నర్ జిష్ణుదేవ వర్మ. మరుగున పడుతున్న వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకురావడమే అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న గవర్నర్, ఇవాళ వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, లక్నవరం సరస్సును తిలకించారు.