Governor Jishnu Dev Varma Visit To Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్బందగా రాష్ట్ర గవర్నర్ జిష్టు దేవ్ వర్మ జనగామ జిల్లాకు చేరుకున్నారు. అక్కడి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నాయకులు, అధికారులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యసదుపాయాల గురించి అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గవర్నర్కు వివరించారు..