Mock Drills in Visakhapatnam: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తల వేళ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ పేరిట విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ దళాలు ప్రజలను ఎలా కాపాడతాయి అనే దానిపై ఓల్డ్ పోస్టాఫీసు కూడలి వద్ద స్థానికులకు అవగాహన కల్పించారు.