YS Jagan Warning to AP Police : ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి బిహార్ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా హింసా రాజకీయాలు చేసిందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆక్షేపించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.