Telangana Art Gallery Photo Exhibition Conducted in Hyderabad : హైదరాబాద్ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ ఫొటోగ్రాఫర్ సొసైటీ ఆధ్వర్యంలో 'గ్యాలరియా - 2025' పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ప్రకృతి, వన్యప్రాణులు, ఆహారం, ప్రయాణం వంటి అంశాలను ప్రతిబింబించే విధంగా 40 మంది ఫొటోగ్రాఫర్లు తీసిన 144 ఫొటోలను ఈ ప్రదర్శనలో ఉంచారు.