Say No to Drugs Programme at Siddhartha College in Vijayawada : రెండు ఎన్డీపీఎస్ కేసుల్లో జైలు శిక్ష పడి, మళ్లీ నేరం చేసిన నిందితులకు మరణశిక్ష పడే అవకాశం ఉందని ఈగల్ విభాగం ఐజీ ఆకె రవికృష్ణ అన్నారు. విద్యార్ధులు గంజాయికి బానిసలై విలువైన భవిష్యత్ ను కోల్పోవద్దని హితవు పలికారు. మత్తు పదార్ధాల వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రతీ కళాశాలలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా నేరమేనని తెలిపారు. 'సే నో టూ డ్రగ్స్' పేరుతో విజయవాడ పీబీ సిద్ధార్ధ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈగల్ ఐజీ, ఎన్టీఆర్ జిల్లా సీపీ పాల్గొని విద్యార్ధులకు గంజాయి వల్ల వచ్చే నష్టాలను వివరించారు.