Ananth Diamonds Inauguration Ceremony : మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరు సందర్భానికి తగ్గట్టు నగలను ఇష్టపడుతున్నారని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన అనంత్ డైమండ్స్ని శైలజా కిరణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ కమిషనర్ రేఖా రాణి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, అనంత్ డైమండ్స్ నిర్వాహకులు వెంకట భాను ప్రకాశ్, విష్ణు ప్రియ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.