Mirchi Farmers Problems at Guntur Mirchi Yard : చెమటోడ్చి కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు మిర్చి యార్డులో కొత్త సీజన్ ప్రారంభం కావటంతో రోజుకు లక్ష బస్తాలకు పైగా సరకు వస్తోంది. పెద్ద ఎత్తున మిర్చి విక్రయానికి తరలిరావటం, గోదాముల్లో పాత పంట పేరుకుపోవటం, అంతర్జాతీయంగా తగ్గిన ఎగుమతులు కారణాలతో ఆశించిన మేర ధర రాకపోవటం అన్నదాతల్ని కుంగదీస్తోంది.