Cm Revanth Reddy On Davos Tour : అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకే దావోస్ వెళ్లామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నామని, దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను దావోస్ సదస్సులో ఆకర్షించామని వెల్లడించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.