Padma Awards in AP 2025 : కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏపీకి సముచిత ప్రాధాన్యం దక్కింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినందుకు గానూ నలుగుర్ని పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఆ పద్మా కుసుమాల నేపథ్యమేంటి వారి విజయ ప్రస్థానాన్ని తెలుసుకుందాం రండి. కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు అరుదైన గౌరవం దక్కింది. బుర్రకథను తెలుగునేలపై ఐదు దశాబ్దాలుగా ఆయన వెలిగించారు.