BR Naidu on Vaikunta Ekadashi : ప్రపంచవ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనంపై మాట్లాడుతున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 10న ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు, 8:00 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానునట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.