Rain Alert in Andhra Pradesh : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుపానుగా మారినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. దీనికి ఫెయింజల్గా నామకరణం చేశారు. తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.