CM Chandrababu on Swarnandhra 2047 : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారని అన్నారు. శాసనసభలో 'స్వర్ణాంధ్రప్రదేశ్-2047' డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్' నినాదంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.