Uranium Mining in Kurnool District : కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు స్థానికులు సిద్ధమౌతున్నారు. దేవనకొండ మండలంలోని 15 గ్రామాలకు చెందిన ప్రజలు కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద సమావేశం అయ్యారు. కప్పట్రాళ్ల రక్షిత అడవిలో కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు 68 బోర్లకు అనుమతులు ఇవ్వడంపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తవ్వకాలకు అనుమతిస్తే అన్ని విధాలుగా నష్టపోతామని ప్రజలు వాపోయారు. యురేనియం అనుమతులు రద్దు చేయాలని, లేదంటే ఉద్యమిస్తామని స్థానిక ప్రజలు హెచ్చరించారు.