Obulapuram Mining Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం గనుల కేసులో ఇవాళ తీర్పు వెలుపడనుంది. సుమారు పదమూడేళ్ల పాటు సాగిన విచారణ ప్రక్రియ ముగియడంతో నేడు తుది తీర్పు ఇవ్వనున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 28న ప్రకటించింది. గాలి జనార్దన్రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా నిందితుల భవితవ్యం తేలనుంది. న్యాయస్థానం 219 మంది సాక్షులను విచారణ జరిపి 3337 డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంది. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా సీబీఐ వేసిన అప్పీలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.