Rains Effect In AP : వాయుగుండం తీరం దాటాక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాలు వాయుగుండం తీవ్రతకు భారీగా నష్టపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తీరంలో ఇళ్లు కోతకు గురయ్యాయి. సీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పరిస్థితిపై కలెక్టర్లతో సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.