Minister Lokesh Meeting with Officials of Education, IT and Electronics Departments : రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్య పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లభించేలా పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గంలో జెమ్స్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని విజ్ఞాన, సృజనాత్మక హబ్గా రూపుదిద్దేందుకు ఆగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు.