Sand Dunes in Crop Felds in Kakinada : ఇసుక మేటలు ఆపై కొట్టుకొచ్చిన రాళ్లు పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలను నిలువునా దెబ్బతీశాయి. కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో ఇటీవల ఏలేరు వరదల ధాటికి పంటలన్నీ కకావికలమయ్యాయి. వరదలు తగ్గిన తర్వాత బయటపడుతున్న పొలాల్ని చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. పంట భూములు సాగుకు పనిరాకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.