ఆ వంతెన నిర్మాణం 80 శాతం పూర్తయింది. మిగతా 20శాతం పనులు పూర్తిచేస్తే నిత్యం 50 వేల మంది ప్రయాణం సాఫీగా సాగుతుంది. జగన్ జమానాలో ఆ భాగ్యానికి నోచుకోలేకపోయిన జనం, కూటమి ప్రభుత్వం రాకతో కొండంత ఆశలు పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ సర్కార్ ఆపేసిన కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల పైవంతెన నిర్మాణ పనుల పునఃప్రారంభం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.