కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో 3 అడుగులున్న పుంగనూరు గిత్త ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన కిరణ్ ఈ గిత్తను పెంచుకుంటున్నారు. కనుమ సందర్భంగా గిత్తను అందంగా అలంకరించిన చిన్న బండిని కట్టారు. దానిపై తన కుమార్తెలను కూర్చొబెట్టి ఊర్లో తిప్పారు. అలాగే మురమళ్లలో జరుగుతున్న కోడి పందేల బరి వద్ద స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు బండిపై కూర్చుని సవారి చేశారు.