జగన్ ఫ్లోర్లీడర్ మాత్రమేనని ప్రతిపక్ష నేత కాదని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. మెుత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా లేఖలు రాయడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.