Jagan worry to YS Vijayamma Open Letter : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల వాటాల అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న వేళ మూడు రోజుల పర్యటన కోసం జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ఆయన దృష్టి సారించారు. ఈ సమయంలోనే విజయమ్మ బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తల్లి విడుదల చేసిన లేఖపై ఇడుపులపాయ గెస్ట్హౌస్లో జగన్ చాలా సేపు ఏకాంతంగా మదన పడినట్లు సమాచారం.