GV Anjaneyulu Comments on YS Jagan : ప్రజాసమస్యల పరిష్కారంపై ఆసక్తి లేదు కాబట్టే జగన్ అసెంబ్లీకి రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. శాసనసభా నియమావళి, క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్కు రాననడం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం జగన్ ఎప్పుడూ పనిచేయలేదన్న ఆయన సభకు రాకుండా ప్రజా సొమ్మును జీతాలుగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.