Boy Death in Guntakal Railway Station: గుంతకల్లు రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. సెలవుల నేపథ్యంలో కుటుంబంతో కలిసి దేవాలయ యాత్రకు బయలుదేరిన పదేళ్ల బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గురువారం రాత్రి సమయంలో స్టేషన్లోని వెయిటింగ్ హాల్ దగ్గర నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, శ్రీవాణి దంపతులకు బాబు, పాప ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రైల్వేస్టేషన్లోని వెయిటింగ్ హాల్ వద్ద నిద్రిస్తున్నారు. ఈ సమయంలో భవనం పై పెచ్చులు ఊడిపడి బాలుడిపై పడ్డాయి. తీవ్రగాయాలైన మణికంఠ (10)ను ప్రథమ చికిత్స కోసం గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా మారడం వల్ల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక ఊహించని ప్రమాదంలో చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసింది
కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, శ్రీవాణి దంపతులకు బాబు, పాప ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రైల్వేస్టేషన్లోని వెయిటింగ్ హాల్ వద్ద నిద్రిస్తున్నారు. ఈ సమయంలో భవనం పై పెచ్చులు ఊడిపడి బాలుడిపై పడ్డాయి. తీవ్రగాయాలైన మణికంఠ (10)ను ప్రథమ చికిత్స కోసం గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా మారడం వల్ల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక ఊహించని ప్రమాదంలో చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసింది
Category
🗞
News