REHEARSALS FOR BOMB BLASTS IN VIZIANAGARAM: దేశంలో బాంబుపేలుళ్ల కోసం ఉగ్రకుట్రను ఆదిలోనే దర్యాప్తు సంస్థలు భగ్నం చేశాయి. అహిం పేరిట ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించిన విజయనగరం, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు, ఇప్పటికే ఒకసారి బాంబు పేలుళ్లకు రిహార్సల్స్ సైతం నిర్వహించారు. సౌదీ హ్యాండ్లర్ ఆదేశాల మేరకు మళ్లీ బాంబు పేలుళ్ల పరీక్షకు సిద్ధమవుతుండగా దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి.