Temple Land Occupied at Prakasham Dist Ullapalem : దేవుడి భూమిలో అక్రమార్కులు పడ్డారు. ధూపదీప నైవేద్యాలకు వచ్చే ఆదాయానికి గండి కొట్టారు. అధికారులతో కలిసి అక్రమంగా పట్టాలు సృష్టించి దేవుడి మాన్యం తమదంటూ పెత్తనం చెలాయిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇతరులకు అమ్మేసుకునేందుకు ప్లాట్లు సైతం వేశారు. వ్యవసాయేతర భూములుగా మార్చాలంటూ రెవెన్యూ శాఖను ఆశ్రయించారు. వారు అభ్యంతరం తెలిపినా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 'స్వాహా' కార్యాన్ని చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు.