Explosion Near Yadematha Temple : రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుళ్లు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న లక్ష్మీగూడలోని ప్రజాపతి శ్రీశ్రీయాదేమాత ఆలయం సమీపంలో చెత్తను తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో పూజారి సుగుణారామ్నకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.