Skip to playerSkip to main contentSkip to footer
  • 4/26/2025
Huge Devotees To Tirumala Tirupati Temple Rush At Alipiri : తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుమలకు భక్తులు సొంత వాహనాలలో తరలి రావడంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ అమాంతం పెరిగిపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీని వల్ల ఆలస్యమవుతోంది. వాహనాలు అలిపిరి ముఖద్వారం వరకు బారులు తీరాయి. టీటీడీ అధికారులు వాహనాల రద్దీని తగ్గించేలా చర్యలు చేపట్టారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
00:30Thank you for listening.

Recommended