Sewage Water Enters Kadiri Sri Lakshmi Narasimha Swamy Temple : శ్రీ సత్యసాయి జిల్లాలోని పవిత్ర క్షేత్రం కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఆలయ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే భక్తుల్లో ఆందోళన మొదలవుతోంది. ఆక్రమణలతో మురుగుకాలువలు కనుమరుగవడంతో తేలికపాటి వర్షానికే వర్షపునీరు రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తోంది. అతిపురాతన ఆలయమైన కదిరిశ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆరేళ్ల నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.