Fraud in The Name Of Online Trading and Stock Market in Nellore District : స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట అమాయకులను మోసం చేసి రూ. 150 కోట్ల మేర వసూలు చేసిన సూభానీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మోసాలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలోను బయటపడ్డాయి. అక్కడి అమాయక ప్రజల నుంచి కూడా భారీగా నగదు వసూలు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అక్రమాలు బయటపడటంతో తెలంగాణ రాష్ట్రం మక్తల్ నుంచి బాధితులు ఇక్కడకు కావలికి తరలి వచ్చారు.