Vijayasai Reddy Quits Politics : రాజకీయాలకు గుడ్బై చెప్పిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఆది నుంచి అరాచకమే. ఆడిటర్గా ఆర్థిక నేరాల్లో ఆరితేరి తర్వాత రాజకీయాల్లోనూ దానినే కొనసాగించారు. వైఎస్ కుటుంబం అక్రమాస్తులను కూడబెట్టడంలో ఆడిటర్గా దన్నుగా నిలిచారు. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు రప్పించడంలో, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడంలో కీలకభూమిక పోషించిన ఘనాపాఠి. వైఎస్ రాజారెడ్డి, తర్వాత రాజశేఖర్రెడ్డి, ఆపైన జగన్. ఇలా వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా విజయసాయిరెడ్డి ఆర్థిక అక్రమ బంధం కొనసాగుతూ వచ్చింది.