YS Sharmila Fires on Amit Shah : గాంధీని చంపిన వ్యక్తికి బీజేపీ గుడులు కట్టి పూజిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంబేద్కర్ను అవహేళన చేసి కనీసం క్షమాపణ చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలం పార్టీ తక్షణమే క్షమాపణ చెప్పాలని, అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరిట రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.