గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందనున్నాయి. వివిధ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన 8 వేల 143 మందికి ఇవాళ పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వైద్యారోగ్య శాఖ ఎంపిక చేసిన 442 మంది అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణి ఉద్యోగాలు దక్కించుకున్న 593 మంది కూడా పత్రాలు అందుకోనున్నారు.