Police Inquiry YS Viveka PA : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్సింగ్పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా సోమవారం పోలీసు విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయణ్ని విచారించారు.