Bomb Threats to Hotels in Tirupati : తిరుపతి నగరానికి ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట మూడు రోజులుగా బాంబు బెదిరింపుల మెయిల్ సందేశాలు రావడం కలకలం రేపుతోంది. పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోటళ్లలో బస చేసే విదేశీయులను హతమారుస్తామంటూ పేర్కొనడంతో విస్తృత సోదాలు చేపట్టిన పోలీసులు బాంబు బెదిరింపులతో కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.