Former Cricketer and Coach Gautam Gambhir in Tirumala : టీం ఇండియా మాజీ క్రికెటర్, కోచ్ గౌతం గంభీర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు గంభీర్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న గంభీర్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.