Home Minister Anitha on Rape Incident: శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై అత్యాచారం జరిగిన ఘటనలో 48 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సీఎం ఆదేశాలు మేరకు ఈ ఘటనలో నిందితులకు వేగంగా శిక్ష పడాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనిపై విచారణకు కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.