CM Revanth Reddy Review On Family Digital Cards : కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబరు 3 నుంచి 7 వరకు క్షేతస్థాయి పరిశీలన పైలట్ ప్రాజెక్టు సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించడంతో పాటు సభ్యులను జత చేర్చడం, తొలగించడం వంటివి పూర్తి చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే కుటుంబ ఫొటోను తీయాలని సీఎం స్పష్టం చేశారు.