Huge Donations To Eenadu Relief Fund: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు రామోజీ గ్రూపు ఈ నెల 4న 5 కోట్ల స్వీయ విరాళంతో ఏర్పాటు చేసిన ఈనాడు సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దిల్లీకి చెందిన ఎన్టీఎస్సీ ఛైర్మన్ ప్రేమ్కిషన్ గుప్త కోటి రూపాయలు ఇచ్చి ఉదారత చాటుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎంతో మంది సహృదయత చాటుతున్నారు. వరద బాధితులకు సాయం చేయాలనుకునేవారు ఈనాడు రిలీఫ్ ఫండ్ యూనియన్ బ్యాంక్ ఖాతా నంబరు 370602010006658కు పంపాలని కోరింది.