Bandi Sanjay about Hydra : హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్న ఆయన, సామాన్యులను సైతం ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు హైడ్రాను హైదరాబాద్కే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బఫర్జోన్, ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలున్నా కూల్చేయాలన్న ఆయన, కొన్ని ప్రాంతాలకే హైడ్రా పరిమితం అవుతోందన్న అనుమానాలు ప్రజలకు వస్తున్నాయని తెలిపారు.