Central Govt Agreed to Widen Kondamodu Road: రాష్ట్రంలో ప్రధాన రహదారులకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మోక్షం కలుగుతోంది. పేరేచర్ల- కొండమోడు రోడ్డును విస్తరించేందుకు కేంద్రం జాతీయ రహదారి 167 ఏజీగా గుర్తించి విస్తరణకు ఆమోదం తెలిపింది. ఈ రహదారి విస్తరణ రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు రాకపోకలు సాగించే వారికి కీలకం కానుంది.