APSRTC Employees As Government Employees: Jagan given orders to officials ds: Andhra Pradesh CM YS Jagan on Thursday given orders to officials to list RTC employees as state government employees
ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 52వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి.. సమగ్ర నివేదికను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తొలి కేబినెట్ సమావేశంలోనే... ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జగన్ సర్కార్ కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అసెంబ్లీలో దానికి ఆమోద ముద్ర వేసింది.