Loksabha Election 2019: మోదీ వేడి తగ్గింది... ఫ్రంటే ప్రత్యామ్నాయమన్న కేటీఆర్!! | Oneindia Telugu
  • 5 years ago
Ktr criticized Prime Minister Narendra Modi. The survey said that the BJP would be restricted to 150 seats. The Congress party was deeply dismayed. Survey said that the Congress alliance would end at 100 seats.
#KTR
#kcr
#trs
#bjp
#congress
#mayavathi
#akhileshyadav
#loksabhaelection2019

కాంగ్రెస్, బీజేపీ కూటమిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 70 ఏళ్లలో ఆ రెండు పార్టీలు దేశానికి చేసిందేమీ లేదని, వెనుకబాటుతనానికి కారణమని విమర్శించారు. సోమవారం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రచారం నిర్వహించారు.

దేశంలో ప్రధాని నరేంద్రమోదీ వేడి తగ్గిందని విమర్శించారు కేటీఆర్. ఏ సర్వే చూసిన బీజేపీ కూటమికి 150 స్థానాలకే పరిమితం అవుతాయని చెబుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గాడి తప్పిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కూటమి 100 సీట్ల వద్దే ఆగిపోతుందని సర్వేల ద్వారా తేటతేల్లమవుతోందన్నారు. ఇకనైనా పార్టీ నేతలు మాయమాటలు చెప్పొద్దని హితవు పలికారు.
Recommended