Loksabha Election 2019: మళ్లీ అజ్ఞాతంలోకి రాములమ్మ... ప్రశ్నార్థకంలో భవితవ్యం!!
  • 5 years ago
During Telangana election, Vijaya Shanthi was declared as the star campaigner from the Congress party. Vijayashanthi made startling comments against KCR and his son as to how they have ignored Telangana. But none of this worked as TRS clean swept the elections and Vijayashanti is nowhere to be seen. What next for her is the big question in her life right now and seeing at the political situation, Vijayashanthi has nowhere to go.
#vijayashanthi
#congress
#loksabhaelection2019
#bjp
#trs
#telangana

సినిమాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ ఒక వెలుగువెలిగిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి. కేసీఆర్ తో విబేధాలతో కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె కొంతకాలం యాక్టివ్ గానే కనిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె ఆ తర్వాత మళ్లీ పత్తాలేకుండా పోయారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పజెప్పినా రాములమ్మ మాత్రం అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ శాంతి స్టార్ క్యాంపెయినర్. నాలుగేళ్లుగా అజ్ఞాతవాసంలో ఉన్న రాములమ్మ ముందస్తు ఎన్నికల సమయంలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ ఎస్ ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్న రాహుల్ గాంధీ ప్రయత్నాలకు తనవంతు సాయం అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలైనా లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చూపిస్తానన్న రాములమ్మ ఇప్పుడు మళ్లీ అజ్ఞాతవాసై పోయారు.
Recommended