మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న కోనసీమ ప్రాంతానికి సోమవారం ఉదయం వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వేసవికాలంతో విసిగిపోయి ఉన్న పజ్రలకు కోనసీమలోని కొన్నిచోట్ల పొగ మంచు అలముకుని, వేసవిలో శీతాకాలాన్ని తలపించింది. ఉదయం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు పలుచోట్ల పొగ మంచు కమ్ముకుంది.