Venkaiah Naidu About Jamili Elections: జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమే అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తిరుపతిలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశంపై నిర్వహించిన మేధావుల సదస్సులో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. సాంకేతికత సాయంతో జమిలి ఎన్నికలు జరపడం కష్టం కాదని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలతో ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు.