Electric Shock Incident in Pedakakani : గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో ఉన్న ఓ గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతిచెందారు. సంపులో పూడికను తొలగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాళీ గార్డెన్స్ రోడ్డులో ఓ గోశాల ఉంది. అక్కడి నుంచి విడుదలయ్యే వ్యర్థాలను పక్కనే ఉన్న సంపుల్లోకి పంపిస్తారు. ఆ నీటిని చుట్టుపక్కన ఉన్న పొలాలకు మళ్లించి పంటలు సాగు చేస్తారు.